వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

ఉత్తర భారతాన్ని ముంచెత్తిన వర్షాలు

జమ్మూకశ్మీర్, నాగాలాండ్, అస్సాంలో భారీ వర్షాల బీభత్సం... వరదలు, కొండచరియలతో ఇళ్లు, రహదారులు ధ్వంసం.. సహాయక చర్యలు ముమ్మరం.. మరిన్ని వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక..

V10TV న్యూస్ డెస్క్20 జులై, 2026 3:17 PM 0
ఉత్తర భారతాన్ని ముంచెత్తిన వర్షాలు
WhatsApp FacebookX Telegram
న్యూఢిల్లీ, జూలై 20 (వి 10 టివి): ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గల్లంతవగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ, దోడా జిల్లాల్లో వరదలు, కొండచరియల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. పలు ఇళ్లు ధ్వంసమవగా, రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లోనూ భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం సంభవించింది. అస్సాంలో కూడా వరదల ప్రభావం కొనసాగుతోంది. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు బృందాలు సహాయక చర్యలు చేపట్టి చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇదిలా ఉండగా, రాబోయే రోజుల్లో కూడా హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

కొత్త చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు

14 గంటల క్రితం 2

ఢిల్లీలో విద్యార్థుల గళం.. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై చర్చ

15 గంటల క్రితం 4

కలుషిత నీటితో గిరిపురంలో డయేరియా కలకలం: మల్లాది విష్ణు

మొన్న 8

పరిశుభ్రతే ప్రగతికి పునాది

3 రోజుల క్రితం 11