విద్యార్థుల భవిష్యత్పై సీఎం ప్రత్యేక దృష్టి
రంపచోడవరంలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి చదువు పురోగతిపై ఆరా ప్రోగ్రెస్ రిపోర్టులను స్వయంగా పరిశీలించి విద్యా నాణ్యతపై సూచనలు
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
రంపచోడవరం, జూలై 24 (వి10టివి): తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక ఫొటో ఫ్రేమ్ వద్ద చిత్రాలు దిగారు.
అనంతరం తరగతి గదిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించిన


ముఖ్యమంత్రి, విద్యార్థుల విద్యా పురోగతిపై ఆరా తీశారు. వారి అభ్యాస స్థాయి, పాఠశాలలో అందుతున్న బోధన, విద్యా వాతావరణంపై వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టు కార్డులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి, మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యా నాణ్యత పెంపు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


