వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

జోగి రమేష్ కుటుంబంపై క్రిమినల్ కేసు.. కోడలు ఫిర్యాదుతో పోలీసుల చర్య

మాజీ మంత్రి సహా 11 మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదు గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం సహా పలు ఆరోపణలు ఫిర్యాదులోని ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన ఇబ్రహీంపట్నం పోలీసులు

V10TV న్యూస్ డెస్క్24 జులై, 2026 4:48 PM 0
జోగి రమేష్ కుటుంబంపై క్రిమినల్ కేసు.. కోడలు ఫిర్యాదుతో పోలీసుల చర్య — చిత్రం 11 / 1
WhatsApp FacebookX Telegram
ఎన్టీఆర్ జిల్లా, జూలై 24 (వి10టివి): మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన భర్త కుటుంబ సభ్యుల నుంచి నిరంతరం మానసిక, శారీరక వేధింపులు ఎదురయ్యాయని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. గృహహింస, వరకట్న వేధింపులు, చీటింగ్, హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆమె చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులోని ప్రతి ఆరోపణపై అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. అవసరమైతే సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేసి, సాక్ష్యాధారాలు సేకరించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

నిరసనల వెనుక కుట్ర కోణం

3 గంటల క్రితం 674

ఎస్‌ఐఆర్‌ పేరుతో మైనారిటీల ఓట్ల తొలగింపు.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన

8 గంటల క్రితం 336

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్య.. త్వరలో మరో డీఎస్సీ: మంత్రి సవిత

8 గంటల క్రితం 652

వచ్చే ఏడాదికి గిరిజన పాఠశాలలన్నింటికీ సొంత భవనాలు: మంత్రి లోకేష్

9 గంటల క్రితం 946