శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షలు... కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో సీఐఎస్ఎఫ్ విస్తృత తనిఖీలు... ఆగస్టు నెలాఖరు వరకు సందర్శకుల పాసుల జారీ నిలిపివేత...

గారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాలతో పాటు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులు, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా, విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆగస్టు నెలాఖరు వరకు సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు.
విమానాశ్రయం పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలని ప్రయాణికులకు సీఐఎస్ఎఫ్ అధికారులు సూచించారు.

