ఎస్సీ వర్గీకరణపై తగ్గేదేలే.. మాల మహానాడు పోరుబాట
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం... మాల అమరవీరుల సంస్మరణ సభలో మాల మహానాడు నేతల పిలుపు... వర్గీకరణపై వెనక్కి తగ్గేది లేదన్న పుష్పరాజ్...

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మాల మహానాడు నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మాల అమరవీరుల సంస్మరణ సభలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య అధ్యక్షతన నాయకులు సమావేశమయ్యారు.
సభ ప్రారంభానికి ముందు మాల అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ మాట్లాడుతూ 1997 నుంచి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోందన్నారు. వర్గీకరణ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు. మాలల ఐక్యతను మరింత బలోపేతం చేసి, తమ డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమిస్తామని తెలిపారు.
మాల అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రంజిత్, కార్యదర్శి భంగి ఆనంద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

