సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన ఈడ్పుగంటి శ్రీనివాస్
కలిదిండి పర్యటనలో ముఖ్యమంత్రికి కూటమి నేతల ఆత్మీయ స్వాగతం... మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కలిసి డాక్టర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ స్వాగతం... కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు...

కలిదిండి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిదిండి పర్యటనకు వచ్చిన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కలిసి యువ నాయకుడు, ఈవీఆర్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా కలిదిండి ప్రాంతంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

