జంక్ ఫుడ్కు రెడ్ అలర్ట్!
• ప్యాకేజ్డ్ ఫుడ్స్పై రెడ్ కలర్ హెచ్చరిక లేబుల్స్కు ప్రతిపాదన... • షుగర్, సాల్ట్, శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటే వినియోగదారులకు వార్నింగ్... • చిన్న వయసులోనే అధిక బరువు, షుగర్, బీపీ సమస్యలపై ఆందోళన...

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వులపై వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాచారం అందించే దిశగా ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ప్యాకేజ్డ్ ఫుడ్స్పై రెడ్ కలర్ డేంజర్ లేబుల్స్ ముద్రించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు కథనం పేర్కొంది. షుగర్, సాల్ట్, శాచురేటెడ్ ఫ్యాట్ నిర్దేశిత పరిమితులను మించి ఉంటే ప్యాక్ ముందు భాగంలోనే హెచ్చరిక కనిపించేలా నిబంధనలు తీసుకురావాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా చిన్నారులు, యువతలో జంక్ ఫుడ్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అధిక బరువు, మధుమేహం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ లేబులింగ్ విధానం తుది నిబంధనగా ఎప్పుడు అమల్లోకి వస్తుందనే అంశంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
