మహిళ ఖాతా ఖాళీ.. సైబర్ కేటుగాళ్ల చేతికి రూ.1.98 లక్షలు!
• విజయవాడ దేవీనగర్కు చెందిన మహిళకు సైబర్ షాక్... • తెలియకుండానే గూగుల్ పే ద్వారా రూ.1.98 లక్షలు బదిలీ... • రెండు రోజుల వ్యవధిలో వరుస లావాదేవీలు...

విజయవాడ క్రైమ్, ఆగస్టు 29: విజయవాడ దేవీనగర్కు చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే రూ.1.98 లక్షలు గూగుల్ పే ద్వారా బదిలీ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు ఇటీవల తన బ్యాంకుకు వెళ్లి ఖాతాను పరిశీలించగా నగదు బదిలీ అయిన విషయం గుర్తించినట్లు సమాచారం. ఆగస్టు 23న రూ.98 వేలు, 24న రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.98 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు.
తనకు తెలియకుండా నగదు బదిలీ జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బు ఏ ఖాతాకు వెళ్లింది? లావాదేవీలు ఎలా జరిగాయి? ఖాతాకు సంబంధించిన వివరాలు ఎలా బయటకు వెళ్లాయి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

