ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ గళం.. లోకేష్ రాజీనామా వరకు పోరాటం: ఆర్కే రోజా, భూమన

డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్.... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం... నగిరి టౌన్‌హాల్ సమావేశంలో యువతను ఉద్దేశించి భూమన, ఆర్కే రోజా ప్రసంగం...

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 11:49 AMకి 553 వీక్షణలు
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ గళం.. లోకేష్ రాజీనామా వరకు పోరాటం: ఆర్కే రోజా, భూమన — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

నగిరి, ఆగస్టు 5: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో నగిరి టౌన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిగే వరకు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. చీకటి జీవోల ద్వారా అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి, అనర్హులకు ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, వసతి దీవెన వంటి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అవి అమల్లోకి వచ్చే వరకు విద్యార్థులు, యువత తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ దెబ్బతిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కూడా అందడం లేదని విమర్శించారు.

సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ రాజారెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి కాయం గాంధీ, ఎస్‌ఐఆర్ రాష్ట్ర పరిశీలకులు వజ్రభాస్కర్ రెడ్డి, నియోజకవర్గ యువత అధ్యక్షుడు యువరాజ్, మండల యువత అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

'ఏపీ అస్త్రం' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించాలి: ట్రాఫిక్ సీఐ రవికుమార్

1 నిమిషం క్రితం 1,121

నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

2 గంటల క్రితం 897

బీహార్‌లో బీజేపీకి షాక్.. ప్రశాంత్ కిషోర్

నిన్న
636

ఉంగుటూరు వద్ద వై.బి. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు

నిన్న 4