ఉంగుటూరు వద్ద వై.బి. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు
డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన అత్కూరు పోలీసులు..


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కృష్ణ : ఆగస్టు 4 (వి 10టివి):కృష్ణాజిల్లా, ఉంగుటూరు: కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న వై.బి. (Y.B.) ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన క్షతగాత్రులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

ప్రమాద సమాచారం అందుకున్న అత్కూరు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
