ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ26, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సర్వమత సామరస్యానికి ప్రతీకగా పశ్చిమం

పంజా సెంటర్‌లో భక్తిశ్రద్ధలతో ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ బయాన్... మత పెద్దలు, ఉలేమాలను ఘనంగా సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి... ప్రవక్త బోధనలు శాంతి, దయ, సోదరభావానికి మార్గదర్శకం: వెలంపల్లి శ్రీనివాసరావు...

V10TV న్యూస్ డెస్క్ 26 ఆగస్టు, 2026 11:52 AMకి 3,655 వీక్షణలు
సర్వమత సామరస్యానికి ప్రతీకగా పశ్చిమం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 26: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్‌లో ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రసంగం (బయాన్) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన గుల్‌పోషి కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఉలేమాలను వెలంపల్లి శ్రీనివాసరావు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి శాంతి, దయ, సమానత్వం, పరస్పర సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. ప్రవక్త బోధనలు సమాజంలో ప్రేమ, ఐక్యతను పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎల్లప్పుడూ సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. మతాలకు అతీతంగా ఒకరి పండుగల్లో మరొకరు భాగస్వాములై ఐక్యంగా జరుపుకోవడం పశ్చిమ నియోజకవర్గ ప్రత్యేకత అని కొనియాడారు.

కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా, పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, సమృద్ధి నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఓటరు జాబితాలో అర్హులకు చోటు తప్పనిసరి: కలెక్టర్ డీకే బాలాజి

1 గంట క్రితం 1,365

ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

2 గంటల క్రితం 1,556

చేతులు లేకున్నా.. ఆశలు వదలని సాయి

2 గంటల క్రితం 1,550

కోడి వ్యర్థాల రవాణాతో కంపుకొడుతున్న శివారు ప్రాంతాలు

3 గంటల క్రితం 1,655