ఓటర్ జాబితా సవరణను సద్వినియోగం చేసుకోండి
పశ్చిమ నియోజకవర్గంలో బూత్ నంబర్లు 229, 231 పరిధిలో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్... • సవరణ నోటీసులు అందిన వారు అవసరమైన ధ్రువపత్రాలతో వివరాలు సరిచేసుకోవాలని సూచన... • బీఎల్ఏల సహకారంతో ఆన్లైన్లో సవరణలు చేసుకోవాలి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా...

విజయవాడ ఆగస్టు 18: పశ్చిమ నియోజకవర్గంలోని బూత్ నంబర్లు 229, 231 పరిధిలో మంగళవారం కొత్త ఓటర్ జాబితా వెరిఫికేషన్, సవరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా పాల్గొని ఓటర్లకు పలు సూచనలు చేశారు.
ఓటర్ జాబితా సవరణకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైన చోట ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పదో తరగతి సర్టిఫికెట్ తదితర ధ్రువపత్రాలతో బీఎల్ఏల సహకారంతో ఆన్లైన్లో సవరణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ఓటరు జాబితాలో పేరు, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే నిర్ణీత సమయంలోనే సరిచేసుకోవాలని బాజీ బాబా కోరారు. కార్యక్రమంలో బీఎల్ఏలు ఈ. జగదీష్, ఎం. జ్యోతిర్మయి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

