ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, సెప్టెంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం

పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణాష్టమి వేడుకలు పలు డివిజన్లలో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పర్యటన ప్రజలు, భక్తులకు పర్వదిన శుభాకాంక్షలు

V10TV న్యూస్ డెస్క్ 4 సెప్టెంబర్, 2026 4:03 PMకి 2,579 వీక్షణలు
శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం — చిత్రం 1
శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం — చిత్రం 2
శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రప్రభ): శ్రీకృష్ణుడి బోధనలు ప్రజలను ధర్మం, న్యాయం, సత్యం వైపు నడిపిస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో నిర్వహించిన వేడుకల్లో ఆయనతోపాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరై శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ప్రజలు, భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి బోధనలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, కృష్ణాష్టమి పర్వదినం పశ్చిమ

శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం — అదనపు చిత్రం 2
శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం — అదనపు చిత్రం 3

నియోజకవర్గ ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సుఖదుఃఖాల్లో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా 40వ డివిజన్‌లో చిన్న సుబ్బయ్య, 43వ డివిజన్‌లో ఎం.రాంబాబు, మల్లిబోయిన కొండ, కె.కొండయ్య, ఏడుకొండలు, 47వ డివిజన్‌లో నమ్మిన భాను, నెహ్రూ బొమ్మ సెంటర్‌లోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద బుర్ర కనకరావు, 56వ డివిజన్‌లో శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ నాయకులు, డివిజన్‌ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తమ్ముడి కోసం ప్రయాణం.. మృత్యువుతో ముగింపు!

1 గంట క్రితం 1

వలకు చిక్కిన ‘భారీ’ అదృష్టం!

1 గంట క్రితం 1,184

భక్తుల సౌకర్యాల పేరుతో అధిక వసూళ్లా?

2 గంటల క్రితం 2,569

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

2 గంటల క్రితం 3,657