ఐపీఎస్లకు సస్పెన్షన్ నుంచి ఊరట
విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు ఊరట... సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు... విచారణ కొనసాగుతుందని స్పష్టీకరణ...

అమరావతి, సెప్టెంబర్ 3: ముంబై నటి కాదంబరి జైత్వానీ కేసుకు సంబంధించి సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు ఊరట లభించింది. వారిపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
అయితే సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ, కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులపై గతంలో ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.
కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు వ్యవహారంలో జైత్వానిని వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సస్పెన్షన్ను ఎత్తివేయడంతో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఊరట లభించినట్లైంది.

