డీసీసీబీలో 338 ఉద్యోగాలు.. అభ్యర్థులకు గుడ్న్యూస్!
► 295 స్టాఫ్ అసిస్టెంట్, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ► డిగ్రీ అర్హతతో దరఖాస్తులకు అవకాశం.. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ... ► నెలకు రూ.47 వేల ప్రారంభ వేతనం.. 15 వరకు దరఖాస్తుల గడువు...

ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు) శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 338 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 295 స్టాఫ్ అసిస్టెంట్, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిగ్రీతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.47 వేల ప్రారంభ వేతనం లభించనుంది. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు, విశాఖపట్నం, కడప, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

