ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ14, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం

▪️ సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని దుర్గాఘాట్‌లో ప్రత్యేక పూజలు... ▪️ కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి వేద పండితుల వరుణ పారాయణం... ▪️ తాగు, సాగునీటికి కొరత లేకుండా.. రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పం...

V10TV న్యూస్ డెస్క్ 14 ఆగస్టు, 2026 10:38 AMకి 2,564 వీక్షణలు
ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం — చిత్రం 1
ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 14 (V10TV): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగానికి సంబంధించిన ప్రత్యేక పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

పవిత్ర కృష్ణానది తీరంలోని శ్రీ దుర్గా స్నానఘాట్‌లో ఉదయం 6.15 గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి నదులు, చెరువులు, జలాశయాలు నిండాలని, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉండాలని వేద పండితులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం — అదనపు చిత్రం 2

ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వరుణ అనువాక సహిత పారాయణాలు నిర్వహించారు. ప్రత్యేకంగా పండితుల బృందం పవిత్ర కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి సకాలంలో వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ వేద మంత్రాలను పఠించారు.

ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలకు అవసరమైన నీరు సమృద్ధిగా లభించి రైతాంగం ఆనందంగా ఉండాలనే సంకల్పంతో వరుణ యాగ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పవన్ పర్యటనకు టీడీపీ ఎమ్మెల్యేల డుమ్మా?

6 నిమిషాల క్రితం 1,236

ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ విస్తృత ప్రచారం

24 నిమిషాల క్రితం 1,258

కృష్ణా జిల్లాలో నేరాలకు కళ్లెం

48 నిమిషాల క్రితం 1,160

హెల్మెట్ శిరోభారం కాదు.. ప్రాణాలకు రక్షణ

1 గంట క్రితం 1,238