ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్‌లో నిధుల జమ

గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం సహకారం: మంత్రి పొంగులేటి... మార్చి 31 వరకు పూర్తయిన 15,475 ఇళ్లకు రూ.185 కోట్ల విడుదల... లబ్ధిదారుల ఖాతాల్లో అక్టోబర్‌లో మొత్తం జమ చేస్తామని వెల్లడి...

V10TV న్యూస్ డెస్క్ 27 ఆగస్టు, 2026 11:50 AMకి 1,256 వీక్షణలు
ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్‌లో నిధుల జమ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్లు వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన 15,475 ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.185 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ మొత్తాన్ని ప్రస్తుతం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అక్టోబర్‌లో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వెల్లడించారు.

గ్రామీణ పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని, కేంద్ర సహకారంతో పథకం అమలుకు మరింత ఊతం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి: చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డిYc

12 గంటల క్రితం 5

రేషన్ బియ్యం వద్దంటే.. ఖాతాలో డబ్బులు!

13 గంటల క్రితం 1,914

ఆరోగ్యానికి అండగా.. రూ.5.18 లక్షల ఎల్‌ఓసీ

13 గంటల క్రితం 2,325

క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.. సైబర్‌ మోసానికి చెక్‌ పెట్టండి!

14 గంటల క్రితం 3,660