ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ మంతనాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం... 37 ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలపై కీలక చర్చ... పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రధాన దృష్టి...

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 2:28 PMకి 1,213 వీక్షణలు
రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ మంతనాలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా వివిధ రంగాలకు చెందిన పెట్టుబడి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.

ఎస్ఐపీబీ ముందుకు మొత్తం 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షించారు.

ప్రతిపాదిత ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి సారించారు.

సమావేశంలో మంత్రులు కె. అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కాంట్రాక్టర్లకు మంత్రి నిమ్మల సీరియస్ వార్నింగ్

12 నిమిషాల క్రితం 1

పేదోడు మరింత పేదగా.. పెద్దోడు మరింత పెద్దగా!

56 నిమిషాల క్రితం 2

స్టైఫండ్ పెంచాల్సిందే.. జూనియర్ డాక్టర్ల నిరసన

1 గంట క్రితం 1,238

ఎద్దు కోసం ప్రాణాలకు తెగించి.. చివరకు మృత్యుఒడిలోకి

1 గంట క్రితం 1,147