డ్వాక్రా మహిళకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందజేత
లబ్ధిదారు శివనాగ కుమారికి స్వయం ఉపాధి కోసం చేయూత... ఎగ్ కార్ట్ అందజేసిన అడ్డూరి శ్రీరామ్, ప్రత్తిపాటి శ్రీధర్... మహిళల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: అడ్డూరి శ్రీరామ్...

ఆగస్టు 15 — V10TV AP: మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం చేయూతనిస్తోందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో శనివారం డ్వాక్రా మహిళ శివనాగ కుమారికి రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్తో కలిసి ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేలా ఇటువంటి ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందుకోవడంపై లబ్ధిదారు శివనాగ కుమారి సంతోషం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్పీ భవాని, ఎన్డీయే కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

