విజయవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షల వద్ద హైటెన్షన్
మరుటీనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతల రిలే నిరాహార దీక్షలు. అనుమతి లేదంటూ దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నం. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వేళ భారీగా మోహరించిన పోలీసులు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మరుటీనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షలకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వైసీపీ నేతలు నిరసన కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

