దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో, చైర్మన్ వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేత


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఎన్టీఆర్

జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పెనుగొండ సుబ్బారాయుడు, ధర్మకర్తల మండలి సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ వేదపండితులు సుజనా చౌదరికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

