విజయవాడలో వైసీపీ–టీడీపీ వార్
సత్యనారాయణపురంలో ఉద్రిక్త వాతావరణం వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీకి టీడీపీ నేతల నిరసన భారీగా మోహరించిన పోలీసులు.. పరిస్థితి అదుపులోకి



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న


పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ప్రాంతంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

