ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి.. గన్నవరంలో వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు

గన్నవరంలో ఏపీ జెన్-జెడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం... డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 5:37 PMకి 0 వీక్షణలు
డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి.. గన్నవరంలో వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు — చిత్రం 1
డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి.. గన్నవరంలో వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

గన్నవరం, ఆగస్టు 6: గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనగాని సుందర చైతన్య ఆధ్వర్యంలో ఏపీ జెన్-జెడ్ రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్ రాణి విద్యార్థులకు పార్టీ కండువాలు కప్పి దీక్షలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అనగాని సుందర చైతన్య మాట్లాడుతూ, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.

డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి.. గన్నవరంలో వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు — అదనపు చిత్రం 2

అదేవిధంగా, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!

3 నిమిషాల క్రితం 0

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

1 గంట క్రితం 452

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

1 గంట క్రితం 149

సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ

1 గంట క్రితం 785