ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ24, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయొద్దు: చలసాని

113 ఏళ్ల చరిత్ర కలిగిన సహకార బ్యాంకులను కాపాడాలి... కేంద్రం, ఆర్‌బీఐ చర్యలతో సహకార బ్యాంకులకు ఇబ్బందులు వస్తున్నాయని ఆందోళన... సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్...

V10TV న్యూస్ డెస్క్ 24 ఆగస్టు, 2026 12:19 PMకి 1,365 వీక్షణలు
సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయొద్దు: చలసాని — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 24: సహకార బ్యాంకులను నిర్వీర్యం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విరమించుకోవాలని ఫెడరేషన్ అధ్యక్షుడు చలసాని రామచంద్రరావు డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన సహకార బ్యాంకుల పరిస్థితిపై మాట్లాడారు.

సుమారు 113 సంవత్సరాల చరిత్ర కలిగిన సహకార బ్యాంకులు ప్రజల నమ్మకంతో కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు చిన్న వ్యాపారులు, వివిధ వర్గాలకు సహకార బ్యాంకులు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని చెప్పారు. అలాంటి బ్యాంకుల మనుగడకు ఇబ్బంది కలిగించే విధానాలను అమలు చేయడం సరికాదన్నారు.

సహకార బ్యాంకుల స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని చలసాని రామచంద్రరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న కొన్ని చర్యలు సహకార బ్యాంకుల కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా మరింత బలోపేతం చేసేలా విధానాలు రూపొందించాలని కోరారు.

ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్న సహకార బ్యాంకుల ప్రత్యేకతను గుర్తించాలని, వాటి మనుగడకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సహకార రంగాన్ని కాపాడేందుకు అవసరమైతే తమ వంతుగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కార్యదర్శి అబ్దుల్ జిలానీ, ఉపాధ్యక్షుడు అమృతరావు, డైరెక్టర్ లావణ్యదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

3 నిమిషాల క్రితం 1,352

డయేరియాకు చెక్.. పరిశుభ్రతపై ఫోకస్

58 నిమిషాల క్రితం 1,271

గన్నవరం చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

2 గంటల క్రితం 1,427

ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వసూళ్లు.. కారు వదిలి పరార్

2 గంటల క్రితం 2,136