ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

'మార్పు కావాలి' నినాదంతో సీపీఐ పాదయాత్ర ప్రారంభం

దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రజల్లోకి సీపీఐ ప్రచార యాత్ర బీజేపీ విధానాలపై ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు విజయవాడ సమగ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 6:00 PMకి 2 వీక్షణలు
'మార్పు కావాలి' నినాదంతో సీపీఐ పాదయాత్ర ప్రారంభం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 6 (వి10టివి): దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య అన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన 'బద్లావ్ జరూరీ హై – మార్పు కావాలి' ప్రచార పాదయాత్రను గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురం శేఖర్‌బాబు భవన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, విద్యా రంగంలో అవకతవకలు పెరిగాయని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, నిరుద్యోగ నిర్మూలన, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మార్పు అవసరమని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర కూటమి ప్రభుత్వ విధానాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని, నగరంలోని కొండ ప్రాంతాల అభివృద్ధి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతుల కల్పనలో కమ్యూనిస్టు నాయకులు చేసిన కృషిని గుర్తు చేశారు. నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఫ్లైఓవర్లు, స్టేడియం నిర్మాణం, కొండ ప్రాంతాల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పందించకపోతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!

2 నిమిషాల క్రితం 0

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

1 గంట క్రితం 452

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

1 గంట క్రితం 149

సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ

1 గంట క్రితం 785