ఎస్సీ, ఎస్టీల రక్షణలో రాజీ వద్దు: సీఎం చంద్రబాబు
అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై హైపవర్ కమిటీ సమీక్ష... సంక్షేమ కార్యక్రమాలు, కేసుల పరిష్కారంపై అధికారులతో చర్చ... సమావేశంలో మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు...

అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలు, ఆయా వర్గాల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది.
సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు తీరు, నమోదైన కేసుల పురోగతి, బాధితులకు అందుతున్న సహాయం, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో చట్టం సమర్థంగా అమలయ్యేలా సంబంధిత శాఖల మధ్య సమన్వయం, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఎస్సీ, ఎస్టీల భద్రతతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతినీ పరిశీలించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

