విజయవాడ బందర్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పీవీపీ మాల్ సమీపంలో మృతదేహం గుర్తింపు మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా ఆచూకీ తెలిసినవారు మాచవరం పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి

విజయవాడ: బందర్ రోడ్డులోని పీవీపీ మాల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, ఒంటిపై ఎరుపు చారల చొక్కా, ధరించి ఉన్నట్లు సమాచారం. మృతుడి వివరాలు గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మృతుడి ఆచూకీ తెలిసినవారు మాచవరం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని హెడ్ కానిస్టేబుల్ శివరాం ప్రసాద్ కోరారు.

