కష్టకాలంలో నేపాల్కు భారత్ అండ
భూకంప ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సహాయక సామగ్రి తరలింపు... భారత వాయుసేన విమానంలో ఐదు టన్నుల రిలీఫ్ మెటీరియల్... మందులు, వైద్య సామగ్రి, దుప్పట్లు సహా నిత్యావసరాలు పంపిణీ...

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రకృతి విపత్తుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపాల్కు భారత్ మరోసారి అండగా నిలిచింది. అత్యవసర సహాయక చర్యల్లో భాగంగా భారత వాయుసేన విమానం ద్వారా సుమారు ఐదు టన్నుల సహాయక సామగ్రిని నేపాల్కు తరలించినట్లు సమాచారం.
వైద్య సహాయం కోసం అవసరమైన మందులు, మెడికల్ సామగ్రితో పాటు బాధితులకు ఉపయోగపడే దుప్పట్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపించారు. ప్రభావిత ప్రాంతాల్లో కనెక్టివిటీని పునరుద్ధరించడం, సహాయక బృందాల కార్యకలాపాలకు అవసరమైన సామగ్రిని కూడా భారత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైడ్రోపవర్ టన్నెల్స్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు సహాయం చేస్తున్నట్లు సమాచారం. విపత్తు ప్రభావం నుంచి నేపాల్ కోలుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలను కొనసాగించే దిశగా భారత్ చర్యలు చేపడుతోంది.

