కాణిపాకం బ్రహ్మోత్సవాలకు లోకేష్కు ఆహ్వానం
ఉండవల్లి నివాసంలో ఆహ్వానపత్రిక అందజేత హాజరైన ఎమ్మెల్యే మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాల అందజేత

అమరావతి, సెప్టెంబరు 4: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి నారా లోకేష్ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో ఎమ్మెల్యే మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్కు వేదాశీర్వచనం చేసి, శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆలయ అధికారులు మంత్రికి వివరించారు.

