కృష్ణా నదిపై మరో కొత్త బ్రిడ్జి నిర్మాణం
▪️ సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ను అనుసంధానిస్తూ కొత్త వంతెనకు ప్రణాళిక... ▪️ ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన 1.10 కి.మీ పొడవుతో 6 వరుసల ఎలివేటెడ్ బ్రిడ్జి... ▪️ ఫీజిబిలిటీ తదితర అంశాల అధ్యయనానికి ఏజీఐసీఎల్ టెండర్ ఆహ్వానం...

విజయవాడ: కృష్ణా నదిపై మరో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ను అనుసంధానించేలా బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు ఏజీఐసీఎల్ టెండర్ను ఆహ్వానించింది. ప్రకాశం బ్యారేజీకి సుమారు 300 మీటర్ల దిగువన 1.10 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల ఎలివేటెడ్ బ్రిడ్జి నిర్మించే అవకాశాలను పరిశీలించనున్నారు. అమరావతిని విజయవాడతో మరింత మెరుగ్గా అనుసంధానం చేయడమే ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.

