వైఎస్సార్సీపీలో విషాదం.. జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మిక మృతి
ఉదయం కార్యకర్తలతో సమావేశం.. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది విజయవాడకు తరలిస్తుండగా ఏలూరు సమీపంలో తుదిశ్వాస జిల్లా ఉపాధ్యక్షురాలి మృతితో పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం

ఏలూరు జిల్లా: వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సమయంలో ఆమెకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా ఏలూరు సమీపంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. జానకిరెడ్డి ఆకస్మిక మృతితో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఆమె మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

