కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన గుడివాడ ఎమ్మెల్యే... మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథితో పలు అంశాలపై చర్చ... 22-ఏ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వెనిగండ్ల రాము..


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కలిదిండి: ఏలూరు జిల్లా కలిదిండి గ్రామంలో సోమవారం జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే రాము కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం కలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన 22-ఏ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

