సీఐ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు
మాచవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం... రక్షక్, బ్లూ కోల్ట్ వాహనాలతో నిరంతరం ఏరియాలో గస్తీ నిర్వహించాలని ఆదేశం... నేరం జరిగితే సంబంధిత సిబ్బందిదే బాధ్యత.. పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ...

విజయవాడ: మాచవరం పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ స్టేషన్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
రక్షక్, బ్లూ కోల్ట్ వాహనాలు నిరంతరం తమకు కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా నేరం జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం.
స్టేషన్ పరిధిలో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

