పార్ట్టైమ్ జాబ్ పేరుతో యువతికి రూ.8.06 లక్షల టోకరా
ఇన్స్టాగ్రామ్లో ఉద్యోగ ప్రకటనతో సైబర్ నేరగాళ్ల వల... చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కలిగించి.. ఆపై వివిధ టాస్కుల పేరుతో డబ్బులు వసూలు... మోసపోయానని గుర్తించిన బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు...

విజయవాడ క్రైమ్, ఆగస్టు 19: పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేసి రూ.8.06 లక్షలకు పైగా కాజేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది.
ఇన్స్టాగ్రామ్లో పార్ట్టైమ్ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన చూసిన యువతి అందులో పేర్కొన్న వివరాలను నమ్మింది. ఉద్యోగం కోసం వెతుకుతున్న బాధితురాలిని సైబర్ నేరగాళ్లు సంప్రదించి, కొన్ని టాస్కులు పూర్తి చేస్తే ఆదాయం వస్తుందని నమ్మించారు.
తొలుత చిన్న మొత్తాలకు సంబంధించిన టాస్కులు ఇచ్చి, వాటికి డబ్బులు చెల్లించడం ద్వారా బాధితురాలిలో నమ్మకం కలిగించారు. అనంతరం మరింత లాభం వస్తుందంటూ వివిధ టాస్కుల పేరుతో విడతల వారీగా నగదు చెల్లించాలని సూచించారు.
వారి మాటలు నమ్మిన యువతి పలు విడతల్లో మొత్తం రూ.8,06,876 చెల్లించింది. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించి మాచవరం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

