ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ7, సెప్టెంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

వదిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో జరిగిన హత్య కేసు... బంగారు హరిపై నేరం రుజువు.. రూ.1,000 జరిమానా... 9 మంది సాక్షుల విచారణ అనంతరం మహిళా సెషన్స్ కోర్టు తీర్పు...

V10TV న్యూస్ డెస్క్ 7 సెప్టెంబర్, 2026 5:59 PMకి 1,915 వీక్షణలు
వదిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్, సెప్టెంబరు 7 (ఆంధ్రప్రభ): వదినను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. పటమట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 71/2024, సెక్షన్ 302 ఐపీసీ కేసులో విజయవాడ పటమట రెల్లి కాలనీకి చెందిన బంగారు హరి (42)పై నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది.

పోలీసుల వివరాల ప్రకారం, యర్రంశెట్టి లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బంగారు దుర్గకు సుమారు 20 ఏళ్ల క్రితం సమీప బంధువుతో వివాహం జరిగింది. చిన్న కుమార్తెను కూడా అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి వివాహం చేశారు. పెద్ద కుమార్తె దుర్గ తన భర్తతో మనస్పర్థల కారణంగా సుమారు మూడు సంవత్సరాలుగా పిల్లలతో విడిగా నివసిస్తోంది.

ఈ క్రమంలో చిన్న కుమార్తె భర్త బంగారు హరి, దుర్గతో చనువుగా ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మందలించారు. అనంతరం దుర్గ హరికి దూరంగా ఉండటంతో అతడు ఆమెపై కోపం పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 2024 జనవరి 30న మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దుర్గపై హరి తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు.

అప్పటి పటమట ఇన్‌స్పెక్టర్ డీకేఎన్ మోహన్ రెడ్డి కేసును దర్యాప్తు చేసి, సిబ్బందితో కలిసి 2024 ఫిబ్రవరి 13న నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

విచారణలో నిందితుడిపై నేరం రుజువవడంతో మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి. రాజేశ్వరి సోమవారం జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. జ్ఞానాంబ వాదనలు వినిపించారు. సిఎంఎస్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, ప్రస్తుత పటమట ఇన్‌స్పెక్టర్ పవన్ కిషోర్, సిఎంఎస్ సిబ్బంది పర్యవేక్షణలో మొత్తం 9 మంది సాక్షులను విచారించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

చిల్లె రాజ్‌కుమార్ సేవలు మరువలేనివి

1 గంట క్రితం 1,146

స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

2 గంటల క్రితం 1,259

విజయవాడ నడిబొడ్డున కాలువ పూడ్చివేతపై వివాదం

2 గంటల క్రితం 3,216

ముస్తాబాద్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై మెరుపుదాడి

2 గంటల క్రితం 3,580