ఎన్నికల అధికారికి వైసీపీ లేఖ
ఎస్ఐఆర్లో మ్యాపింగ్ కాని ఓటర్ల డాక్యుమెంట్ల నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి... ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ.. ఏవైనా కలవాల్సిన వివరాలు నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనాలని వినతి... ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున రక్తసంబంధీకులు పత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని కోరిన పార్టీ...

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లు సమర్పించాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించిన నిబంధనలను సడలించాలని కోరుతూ వైసీపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ఓటర్లు ఏయే వివరాలు లేదా పత్రాలు సమర్పించాల్సి ఉంటుందో నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగాలు, చదువు తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు స్వయంగా హాజరై పత్రాలు సమర్పించడం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
అలాంటి వారి తరఫున రక్తసంబంధీకులు అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించాలని, నేరుగా అధికారులకు అందించలేని పరిస్థితుల్లో బీఎల్ఓల ద్వారా పత్రాలు అందించే వెసులుబాటు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ కోరింది.
