పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
భవానిపురంలో కోలాహలంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ... విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV విజయవాడ, ఆగస్టు 13: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దేశభక్తి వెల్లివిరిసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం భవానిపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ర్యాలీని ప్రారంభించి విద్యార్థులు, కూటమి నేతలు, స్థానికులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
చేతుల్లో మువ్వన్నెల జెండాలు పట్టుకున్న విద్యార్థులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. త్రివర్ణ పతాకాలతో ర్యాలీ మార్గం దేశభక్తి వాతావరణంతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఊర్మిళ నగర్ మండల బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ షర్మిల, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ నిర్మల, డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, పగడాల కృష్ణ, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, గోళ్ళ విశ్వేశ్వరరావు, అల్లంకి శ్రీనివాస్, జయాబాలన్, కందుల సుబ్రమణ్యేశ్వరరావు, పైలా సురేష్, పచ్చిపులుసు ప్రసాద్, బీఎస్కే పట్నాయక్, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నేతాజీ స్కూల్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి, దీపక్ రాజేష్తో పాటు నేతాజీ స్కూల్ విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

