జాతీయ గీతానికి ముందు రాష్ట్ర గీతం పాడేలా విజయ్ నిర్ణయం
‘తమిళ్ తాయ్ వళ్తు’కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం... 1891లో మనోన్మణియం సుందరనార్ రచించిన గీతానికి ప్రత్యేక గుర్తింపు... 1970లో తమిళనాడు రాష్ట్ర గీతంగా ప్రకటించిన అప్పటి సీఎం కరుణానిధి...

చెన్నై: జాతీయ గీతానికి ముందు రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని తమిళనాడు రాజకీయ నేత, నటుడు విజయ్ నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కథనం పేర్కొంది. ‘తమిళ్ తాయ్ వళ్తు’ గీతాన్ని 1891లో మనోన్మణియం సుందరనార్ రచించగా, 1970లో అప్పటి సీఎం కరుణానిధి దీనిని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం ఆలపించే విధానాన్ని కొనసాగించాలన్నది విజయ్ నిర్ణయంగా పేర్కొంటున్నారు.

