సాయికృష్ణ కేసులో మరో కీలక అరెస్ట్
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకటేష్ అదుపులోకి... సీసీ ఫుటేజ్ తొలగింపుపై దృష్టి సారించిన సిట్ అధికారులు... వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరు...

విజయవాడ: కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా టెక్నీషియన్గా పనిచేసిన వెంకటేష్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ కేసు విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్లోని సీసీ ఫుటేజ్కు సంబంధించిన అంశంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీఐ నాగరాజు ఆదేశాలతో సీసీ ఫుటేజ్ను తొలగించినట్లు విచారణలో గుర్తించిన నేపథ్యంలో వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో సీసీ కెమెరాల రికార్డింగ్, ఫుటేజ్ తొలగింపు తదితర అంశాలపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వెంకటేష్ను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు సమాచారం. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

