తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న
42వ డివిజన్లో అప్నా బజార్ రోడ్డు నుంచి స్వాతి థియేటర్ రోడ్డు వరకు ర్యాలీ... జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటిచెప్పే కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం: బుద్ధా వెంకన్న దేశ అభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ: జాతీయ సమైక్యత, దేశభక్తి, సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. 42వ డివిజన్ పరిధిలోని అప్నా బజార్ రోడ్డు నుంచి స్వాతి థియేటర్ రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో మరింత పెంపొందించేందుకు తిరంగ ర్యాలీ వంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జాతీయ జెండా

దేశ ఐక్యతకు, సమైక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. కార్యక్రమంలో 42వ డివిజన్ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, క్లస్టర్ యేదుపాటి రామయ్య, పి. చిన్న సుబ్బయ్య, బాలు, శివ, సంతోష్, ముదిరాజ్ శివాజీతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
