ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, సెప్టెంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

డాక్టర్ గరికపాటి రాజారావుకు ఘన నివాళులు

63వ వర్ధంతి సందర్భంగా పోరంకిలో విగ్రహానికి పూలమాలలు... ప్రజా చైతన్యానికి కళే ఆయుధమని ప్రజానాట్యమండలి నేతల పిలుపు... కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 8 సెప్టెంబర్, 2026 1:21 PMకి 2,698 వీక్షణలు
డాక్టర్ గరికపాటి రాజారావుకు ఘన నివాళులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పోరంకి, సెప్టెంబరు 8: ప్రజా కళాకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు 63వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, ఆంధ్ర ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. పోరంకి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్. పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ మార్పు కోసం కళను ఆయుధంగా మలిచిన మహనీయుడు గరికపాటి రాజారావు అని కొనియాడారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కళాకారులు చైతన్యాన్ని విస్తరించాల్సిన బాధ్యత ఉందన్నారు. నాటికలు, నాటకాలు, జానపద కళారూపాలు, నూతన సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలు, దోపిడీ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

గ్రామీణ, జానపద, పౌరాణిక నాటక రంగ కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితం గడుపుతున్నారని, ఎన్నికల సమయంలో మాత్రమే వారిని ఉపయోగించుకుని తరువాత విస్మరించడం తగదని పేర్కొన్నారు. కళాకారుల జీవన భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో అనుమొల ప్రభాకర్, నార్ల వెంకటేశ్వరరావు, వెలగపూడి ఆజాద్, ప్రేమ్ కుమార్, పోతురాజు నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

దుర్గమ్మ ట్రస్ట్ బోర్డులో సుస్మితకు ఆహ్వానం

20 నిమిషాల క్రితం 0

ఎంఎస్‌ఎంఈ పేరుతో భారీ వసూళ్ల ఆరోపణలు

34 నిమిషాల క్రితం 0

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం తగదు

44 నిమిషాల క్రితం 0

పట్టాలెక్కనున్న దేశ తొలి బుల్లెట్ ట్రైన్

1 గంట క్రితం 2,146