శాసన మండలిలో వర్ల అనుభవం రాష్ట్రానికి ఉపయోగకరం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వర్ల రామయ్యకు ఘనంగా అభినందనలు భవానీపురంలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యను ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విజయవాడ భవానీపురంలోని వర్ల రామయ్య నివాసానికి నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యే సౌమ్య, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, వర్ల రామయ్యకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన శాసన మండలిలో రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. శాసన మండలి వేదికగా ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు.

