అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఘటన ఫుట్పాత్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెంది ఉండొచ్చని ప్రాథమిక సమాచారం

విజయవాడ క్రైమ్, ఆగస్టు 21 : విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన రాథోడ్ సింగ్గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రామవరప్పాడు రింగ్ సమీపంలో మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.

