ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ25, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు!

స్నాప్‌చాట్ పరిచయంతో మొదలైన వ్యవహారం.. క్రిప్టోలో డబ్బు బ్లాక్ అయిందంటూ రూ.10.42 లక్షలు... డబ్బివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫొటోలు పంపినట్లు యువతి ఫిర్యాదు... బంగారం తాకట్టు.. క్రెడిట్ కార్డు రుణాలు.. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు...

V10TV న్యూస్ డెస్క్ 25 ఆగస్టు, 2026 11:03 AMకి 2,325 వీక్షణలు
చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 25: స్నాప్‌చాట్‌లో ఏర్పడిన పరిచయం ఓ యువతికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడి విజయవాడకు చెందిన యువతి నుంచి విడతల వారీగా సుమారు రూ.1.38 కోట్లు తీసుకున్నాడనే ఆరోపణలపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సూర్యారావుపేటకు చెందిన బాధిత యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమెకు స్నాప్‌చాట్ ద్వారా మద్దిశెట్టి గౌతంనాయుడు అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని, అమలాపురం సమీపంలోని అంబాజీపేట తన స్వగ్రామమని చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు. పరిచయం పెరగడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారని, ఈ ఏడాది జూన్‌లో కోయంబత్తూరుకు కూడా వెళ్లినట్లు సమాచారం.

కోయంబత్తూరులో ఉన్న సమయంలో ఆన్‌లైన్ క్రిప్టో కరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఆ మొత్తం బ్లాక్ అయిందని చెప్పి అత్యవసరంగా డబ్బు కావాలని యువతిని కోరినట్లు సమాచారం. దీంతో ఆమె లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని తొలుత రూ.10.42 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఆ తర్వాత కూడా డబ్బులు కావాలని కోరగా తన వద్ద లేవని యువతి చెప్పడంతో, డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినట్లు ఆరోపించింది. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్నట్లుగా ఫొటోలు తీసి వాట్సాప్‌లో పంపినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియకుండా ఇంట్లోని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతో పాటు క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని మరో రూ.1.27 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అయినప్పటికీ మరింత డబ్బు కావాలంటూ వేధింపులు కొనసాగినట్లు ఆరోపిస్తూ చివరకు బాధిత యువతి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నగదు లావాదేవీలు ఎలా జరిగాయి, డబ్బు ఎక్కడికి వెళ్లింది, సంబంధిత ఆర్థిక కార్యకలాపాలు ఏమిటనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పండుగ వేళ.. ప్రశాంతతే ప్రధాన మంత్రం!

12 నిమిషాల క్రితం 1,254

వైద్యం ముసుగులో మోసం.. 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్

22 నిమిషాల క్రితం 1,217

అమెజాన్ ఆర్డర్ల పేరిట రైల్వే అధికారికి టోకరా!

44 నిమిషాల క్రితం 1,114

అమరావతిలో క్వాంటం విప్లవం

1 గంట క్రితం 1,232