దక్షిణాది వినియోగదారుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి
▪️ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి సదస్సు ▪️ విజయవాడ లేదా గుంటూరులో నిర్వహణకు సన్నాహాలు ▪️ ఏర్పాట్లపై సమన్వయ సమితి ప్రతినిధుల సమావేశం

V10TV – మచిలీపట్నం
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి (CCC) జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు.
త్వరలో నిర్వహించనున్న ఈ సదస్సుకు విజయవాడ లేదా గుంటూరును వేదికగా ఎంపిక చేసే అంశంతో పాటు కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లపై ప్రతినిధులు సమావేశమై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వినియోగదారుల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినియోగదారుల హక్కులు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఈ సదస్సు వేదిక కానుందని పేర్కొన్నారు.
సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ మేడా రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు గంగిశెట్టి బాబు రాజేంద్ర, రాష్ట్ర కార్యదర్శి దిలీప్ సాయి, రాష్ట్ర సహాయ కార్యదర్శి శాఖమూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
