బెజవాడ–అమరావతికి రోప్వే.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం
విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి వెంకటపాలెం బాలాజీ ఆలయం వరకు రోప్వే ప్రణాళిక... పీఎన్బీఎస్, ఇంద్రకీలాద్రి, భవానీ ద్వీపం మీదుగా కృష్ణానదిని దాటే ప్రతిష్ఠాత్మక మార్గం... భక్తులు, పర్యాటకులకు వేగవంతమైన ప్రయాణం.. పర్యాటక రంగానికి కొత్త ఊపు...

విజయవాడ, ఆగస్టు 5 (వి10టివి): విజయవాడ నగరం నుంచి అమరావతి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే ప్రతిష్ఠాత్మక రోప్వే ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి పండిట్ నెహ్రూ బస్స్టాండ్, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం, భవానీ ద్వీపం మీదుగా కృష్ణానదిని దాటి అమరావతి రాజధానిలోని వెంకటపాలెం టీటీడీ బాలాజీ ఆలయం వరకు రోప్వే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు విజయవాడ–అమరావతి ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది.

