ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

మద్యం మత్తులో లారీ డ్రైవింగ్.. 10 రోజులు జైలు!

బ్రీత్ అనలైజర్‌లో ఏకంగా 568 mg/100 ml నమోదు... కంటైనర్ లారీని ప్రమాదకరంగా నడిపిన డ్రైవర్‌పై కేసు... 10 రోజుల జైలుతో పాటు రూ.12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు...

V10TV న్యూస్ డెస్క్ 28 ఆగస్టు, 2026 10:34 AMకి 2,575 వీక్షణలు
మద్యం మత్తులో లారీ డ్రైవింగ్.. 10 రోజులు జైలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తిరుపతి, ఆగస్టు 27: మద్యం మత్తులో కంటైనర్ లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన డ్రైవర్‌కు నాయుడుపేట కోర్టు 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.

చెన్నై నుంచి నెల్లూరు వైపు జాతీయ రహదారిపై TN-88-J-2370 నంబరు కంటైనర్ లారీని డ్రైవర్ తియగరాజన్ నడుపుతూ మల్లాం జంక్షన్ సమీపంలో ప్రమాదకరంగా వెళ్తున్నట్లు డయల్-112కు సమాచారం అందింది.

వెంటనే నాయుడుపేట ఎస్‌ఐ ఎం. శివశంకర్ రావు, బీట్ సిబ్బంది లారీని అడ్డుకుని డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో 568 mg/100 ml ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

దీంతో మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధించారు.

మద్యం సేవించి వాహనం నడిపేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా డ్రైవర్ తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాడని పేర్కొన్నారు.

‘‘వేగం కంటే ప్రాణం విలువైనది.. మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్న కుటుంబాన్ని గుర్తుంచుకోండి. మద్యం సేవించి వాహనం నడపవద్దు’’ అని జిల్లా పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అమరావతికి అభివృద్ధి బూస్ట్.. రూ.1,129 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్!

42 నిమిషాల క్రితం 1,921

బస్సులో భారీ చోరీ.. రూ.22 లక్షలు, 400 గ్రాముల బంగారం మాయం!

51 నిమిషాల క్రితం 1,597

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్–ఏఐ యూనివర్సిటీ

1 గంట క్రితం
1,982

NTA డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ అధికారి విపన్న వెంకటేష్

1 గంట క్రితం 1,986