గన్నవరంలో ఉద్రిక్తత.. వైసీపీ నేతలు–పోలీసుల మధ్య తోపులాట
మెగా డీఎస్సీపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు... ర్యాలీకి అనుమతి లేదంటూ నిలువరించడంతో నేతలు–పోలీసుల మధ్య వాగ్వాదం... అవాంఛనీయ ఘటనలు జరగకుండా గన్నవరంలో భారీగా పోలీసుల మోహరింపు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం: మెగా డీఎస్సీ అంశంపై వైసీపీ నాయకులు చేపట్టిన నిరసన ర్యాలీ గన్నవరంలో ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వైసీపీ నాయకులను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు భారీగా మోహరించి ర్యాలీని నిలువరించే ప్రయత్నం చేశారు.

