ఎన్టీఆర్ జిల్లాలో ముసుగు దొంగల హల్చల్
గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో అర్ధరాత్రి సంచారం... ముసుగులు ధరించి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు... సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసుల గాలింపు...

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. అంకమ్మతల్లి ఆలయం సమీపంలో చోరీకి పాల్పడిన దుండగులు మరో రెండు ఇళ్లలోనూ చోరీకి యత్నించినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

