ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పరుచూరి ప్రసాద్‌ను పరామర్శించిన పట్టాభిరామ్

ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ – కార్యకర్తల కష్టసుఖాల్లో పార్టీ అండగా ఉంటుందని భరోసా – త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

V10TV న్యూస్ డెస్క్ 31 ఆగస్టు, 2026 10:06 AMకి 1 వీక్షణలు
పరుచూరి ప్రసాద్‌ను పరామర్శించిన పట్టాభిరామ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 31: టీ.ఎన్.టి.యూ.సీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్‌ను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరామర్శించారు. ఇటీవల కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న ప్రసాద్‌ను ఆదివారం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పట్టాభిరామ్ కలిశారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితితో పాటు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్యం, కోలుకుంటున్న తీరుపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తనవంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. పరుచూరి ప్రసాద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మెకానిక్‌ కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

2 గంటల క్రితం 2

గంజాయి ఆనవాళ్లు చెబితే బహుమతి

2 గంటల క్రితం 2

కొత్త జంటకు ‘సుజనా పెళ్లి కానుక’

2 గంటల క్రితం 1

ఇంటింటికీ వెళ్లి.. సమస్యలు తెలుసుకుంటూ

19 గంటల క్రితం 2,747